Rajasaab : రెబల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘రాజా సాబ్‌’ షూటింగ్‌ వేగంగా సాగుతోంది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభాస్‌, మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌తో పాటు మరో కథానాయిక కలిసి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత టి.జి.విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.

హారర్‌ అంశాలతో కూడిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ స్టైలిష్‌ అవతారంలో కనిపించనున్నారు. ప్రభాస్‌ చేతిలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, ‘రాజా సాబ్‌’పై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్‌ 10న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్రణాళిక చేస్తున్నారు.

ప్రభాస్‌ సినిమాలకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత వైభవంగా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌తో పాటు మరో కథానాయిక కలిసి ప్రభాస్‌కు జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ కు ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!