‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’తో అందరిని మెప్పించిన యంగ్ హీరో నవీన్‌ పొలిశెట్టి. తాజా గా ‘జాతిరత్నాలు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అనుదీప్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా ఈ సినిమా తో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్ ఎ చిత్రాన్ని ‌ నిర్మించారు. రాధన్ మ్యూజిక్. ‌ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ విడుదల చేశారు. మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Leave a comment

error: Content is protected !!