‘సాహో’ చిత్రం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. తన కెరీర్ లో 20వ చిత్రాన్ని చేస్తున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్ , యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ కథతో , సరికొత్త మేకోవర్ తో ప్రభాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ కు ముందే జార్జియాలో ఒక షెడ్యూల్  ను కంప్లీట్ చేసిన చిత్ర బృందం .. త్వరలోనే తదుపరి షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నారు.

అయితే ఈ లోపుగానే ఈ సినిమా టైటిల్  పోస్టర్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల మూడో వారంలో  పోస్టర్ ను  విడుదల చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ సినిమాకి ఓ డియర్ , రాధేశ్యామ్ టైటిల్స్ లో ఏదో ఒకటి ఖాయం చేయబోతున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్రీ పండితుడిగా నటిస్తున్నాడని సమాచారం. మరి ఈ సినిమా టైటిల్ పోస్టర్ అభిమానుల్ని  ఏ రేంజ్ లో అలరిస్తుందో  చూడాలి.

Leave a comment

error: Content is protected !!