‘మహానటి’ చిత్రంతో దక్షిణాదిన మంచి క్రేజ్ తెచ్చుకుంది మల్లూ కుట్టి కీర్తి సురేశ్. ఆ సినిమా తర్వాత తాను నటించే సినిమాలన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గానే ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది ఆమె. ఈ నేపథ్యంలో ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘పెంగ్విన్’. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘పెంగ్విన్’ చిత్రం టీజర్ ను విడుదల చేశారు. కార్తిక్ సుబ్బరాజ్ నిర్మాణంలో ఈశ్వర కార్తిక్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

కేవలం కొన్ని సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్ లో క్రైమ్ ఎలిమెంట్.. మర్డర్ మిస్టరీ ఎలిమెంట్ ఆసక్తిని పెంచాయి. కొడుకును కోల్పోయి వేదనకు గురయ్యే గర్భిణిగా కీర్తి సురేష్ నటించింది. చార్లిచాప్లిన్ గెటప్ లో  ఒక సైకో థ్రిల్లర్ .. వరుస మర్డర్స్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ కొడుకు ను కూడా అతడు అపహరిస్తాడు. చివరికి ఆమె కొడుకు బతికి ఉంటాడా లేదా అనేది ఉత్కంఠను కలిగిస్తుంది. ఈ నెల 11న ఈ సినిమా తాలూకా ట్రైలర్ విడుదలవుతోంది. అప్పుడు ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలిసే అవకాశముంది. మరి పెంగ్విన్ చిత్రం కీర్తికి ఏ రేంజ్ లో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

టీజర్ వీక్షించడానికి ఈ కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?time_continue=50&v=SY99XrIv0mM&feature=emb_logo

Leave a comment

error: Content is protected !!