Payal Rajputh : టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పాయల్ రాజ్‌పుత్, దర్శకుడు ప్రణదీప్ ఠాకూర్ మధ్య ఓ వివాదం చిగురించింది. “రక్షణ” అనే సినిమాలో నటించిన పాయల్, సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని ప్రణదీప్ ఠాకూర్ నిర్మాతల సంఘానికి ఫిర్యాదు చేశారు.

పాయల్ 50 రోజుల పాటు సినిమా ప్రచారానికి సమయం కేటాయించాలని ఒప్పుకున్నారు. ఇప్పటికే 47 రోజులు పాటు ఆమె సేవలను ఉపయోగించుకున్నారు. మిగిలిన 3 రోజుల పాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరినా ఆమె నిరాకరించింది. పాయల్‌కు ఇంకా చెల్లించాల్సిన రూ.6 లక్షల బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు అని ప్రణదీప్ ఠాకూర్ అన్నారు.

పాయల్ రాజ్ పుత్ 2019-20లో “5Ws” అనే టైటిల్ తో ఒక సినిమాలో నటించారు. కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఇటీవలి విజయాల నేపథ్యంలో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం చెల్లించాల్సిన బ్యాలెన్స్ మొత్తాన్ని ఇంకా చెల్లించలేదు. బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించిన తర్వాతే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటానని స్పష్టం చేశారు పాయల్ రాజ్ పుత్.

ఈ వివాదంలో ప్రణదీప్ ఠాకూర్‌కు మద్దతు ప్రకటించింది నిర్మాతల సంఘం. పాయల్ రాజ్‌పుత్ తన బాధ్యతలను నెరవేర్చాలని డిమాండ్ చేసింది. ఈ వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. రెండు వైపులా నుండి వాదనలు విని, ఎవరి వాదనలో నిజం ఉందో తేల్చుకోవాల్సి ఉంది.

Leave a comment

error: Content is protected !!