కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు వారాల పాటు జనాలు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. దాని ప్రభావం వల్ల ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ ముందుకొస్తున్నారు.. వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు.. ప్రభుత్వాలు, ప్రజలకు అండగా నిలిచారు. ఇప్పటికే కొందరు తమ సాయాన్ని ప్రకటించారు.

తాజాగా జనసేన అధినేత పవన కళ్యాణ్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా నివారణ, సాయం కింద  కేంద్ర ప్రభుత్వానికి రూ. 1కోటి , ఉభయ  తెలుగు రాష్ట్రాలకు విడిగా భారీ సాయాన్ని ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ.50లక్షల చొప్పున.. రెండు రాష్ట్రాలు కలిపి రూ.కోటిని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తానని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. జనసేనాని భారీ సాయం ప్రకటించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. పవన్ ఫ్యాన్స్‌గా గర్వపడుతున్నాము అంటున్నారు. ఇలాంటి కష్టకాలంలో సాయాన్ని ప్రకటించిన జనసేన అధినేతను ప్రశంసిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!