సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు(70) అనారోగ్యం తో మృతిచెందారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వారపత్రిక, శివరంజని, సంతోషం తదితర సినిమా పత్రికలలో పనిచేశారు. అనేక సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించారు.తెలుగు సినిమా పరిశ్రమ తో 45 ఏళ్లకు పైగా అనుబంధమున్న వ్యక్తి. ఈయన.జర్నలిస్ట్ గానే కాకుండా రైటర్ గా కూడా ఈయన కొన్ని పుస్తకాలని కూడా రచించారు. రామారావు మృతిపట్ల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల తో పాటు పలువురు సినీ ప్రముఖులు, సంతాపం తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్సంతాపం తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Leave a comment

error: Content is protected !!