పరారీ మూవీ నుంచి వరుస అప్‌డేట్స్‌ తో బజ్‌ క్రియేట్ చేస్తోంది మూవీ యూనిట్. టీజర్ ట్రైలర్‌లతో .. మంచి క్వాలిటీతో పాటు కంటెంట్ ఉన్న సినిమాగా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచిన పరారీ మూవీ సాంగ్స్‌ తో కూడా సినిమా పై అంచనాలు పెంచేస్తోంది. యోగీశ్వర్‌, అతిధి జంటగా సాయి శివాజీ డైరెక్షన్‌లో జివివి గిరి నిర్మించిన పరారీ చిత్రం మార్చి 30 న రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ జోరు పెంచింది. మొదటి సాంగ్‌ను లేడీ అమితాభ్ రిలీజ్‌ చేయగా.. ఇప్పుడు ఎల్ల ఎల్ల అంటూ సాగే పాటను ధమాకా డైరెక్టర్‌ నక్కిన త్రినాధరావు రిలీజ్‌ చేసారు. అందరూ కొత్త వారే అయినా ఖర్చుకు వెనుకాడకుండా.. సూపర్బ్ విజువల్‌ క్వాలిటీతో నిర్మించారని నక్కిన త్రినాధరావు అభినందనలు తెలియజేసారు. మహిత్ నారాయణ్ స్వరపరిచిన పరారీ మూవీ సాంగ్స్‌ ట్యూన్‌ పరంగా, విజువల్స్ పరంగా ఆకట్టుకుంటున్నాయి. హీరో సరస్వతీ పుత్రుడు… అలాగే ఎల్ల ఎల్ల సాంగ్ రాసిన రామజోగయ్య శాస్త్రి గారు కూడా సరస్వతీ పుత్రులు.. ఇద్దరు సరస్వతీ పుత్రుల నుంచి వచ్చిన ఈ సాంగ్‌ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని చెప్పారు డైరెక్టర్‌. త్రినాధరావు తన క్షేమం కోరే వారిలో జివివి గిరి ఒకరని.. వారి అబ్బాయి యోగీశ్వర్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ పరారీ మూవీ మంచి విజయం సాధించబోతుందని నమ్మకం వ్యక్తం చేసారు. ఈ సాంగ్‌ లాంచ్‌ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ అంతా పాల్గొన్నారు. మార్చి 30 న పరారీ చిత్రం గ్రాండ్‌గా ధియేట్రికల్ రిలీజ్‌ కాబోతుంది.

నటీ నటులు …
యోగిశ్వర్, అతిధి, సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాత: జి వి వి గిరి,
దర్శకత్వం: సాయి శివాజీ
సంగీతం మహిత్ నారాయణ్,
లిరిక్ రైటర్స్: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి,
ఎడిటర్ గౌతమ్ రాజు,
ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్,
యాక్షన్ :నందు,
కొరియోగ్రఫీ: జానీ, భాను,

Leave a comment

error: Content is protected !!