NTR Jayanthi : నేడు విశ్వవిఖ్యాత పద్మశ్రీ నందమూరి తారక రామారావు  101వ జయంతి సందర్భంగా, ఫిలింనగర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కుటుంబ సభ్యులు మరియు తెలుగు సినీ ప్రముఖులతో కలిసి ఘనంగా జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన్ రూప, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, టిఎఫ్‌పిసి అధ్యక్షుడు కె. ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి ప్రసన్న కుమార్, ఫిలింనగర్ కల్చరల్ కమిటీ కార్యదర్శి మోహన్ ముళ్లపూడి, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్, యూసఫ్‌గూడా కార్పొరేటర్ బండారి రాజ్ కుమార్ పటేల్, బిజెపి నాయకుడు చంద్ర మధు తో పాటు పలు ప్రముఖులు పాల్గొన్నారు.

వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, “జోహార్ ఎన్టీఆర్” అని నినదించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి, నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.

Leave a comment

error: Content is protected !!