Kollywood : ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేసే నటి నిత్యామీనన్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. రీసెంట్ గా జాతీయ అవార్డు గ్రహీత అందుకున్న నిత్యామీనన్ తాజాగా విజయ్ సేతుపతితో కలిసి నటించనున్నట్లు తెలిసింది. ఈ జంట కలిసి తెరపై కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. నిత్యామీనన్ త్వరలోనే ఈ చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ఈ జంట కలిసి కొత్త సినిమా చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిత్యామీనన్, విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!