మహానటి తర్వాత టాలీవుడ్ లో మల్లూ కుట్టి కీర్తి సురేశ్ రేంజే మారిపోయింది. వరుసగా లీడింగ్ స్టార్ హీరోల సరసన కథానాయికగా నటించేస్తోంది. మరోవైపు ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో కూడా నటిస్తూ సత్తా చాటుకుంటోంది. ప్రస్తుతం కీర్తి  ఏకకాలంలో రెండు భాషల్లోని చిత్రాలు చేస్తోంది. అందులో ఒకటి తమిళంలో రజనీకాంత్ అన్నాత్త అయితే..  మరొకటి నితిన్ సరసన ‘రంగ్ దే’ చిత్రం . ఈ రెండు సినిమాల షూటింగ్స్ చివరిదశకు చేరుకున్నాయి.

ఇదిలా ఉంటే.. కీర్తి.. ఇప్పుడు మరో రెండు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చింది. మహేశ్ బాబు ,పరశురామ్ కలయికలో తెరకెక్కనున్న ‘సర్కార్ వారిపాట’ లో కథానాయికగా ఫిక్సైన కీర్తి.. నితిన్ సరసనే మరో సినిమాకి కూడా కమిట్ అవుతోందని సమాచారం. నారా రోహిత్ తో ‘రౌడీఫెలో’ తీసిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. మరి ఈ సినిమా కు కీర్తి స్ర్కీన్ ప్రెజెన్స్ ఏ రేంజ్ లో  అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!