టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్  హీరో .. నిఖిల్ సిద్ధార్ధ.. లాస్టియర్ ‘అర్జున్ సురవరం’ మూవీతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్నాడు. అదే ఉత్సాహంతో ఈ ఏడాది రెండు వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. అందులో ఒకటి సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో ’18 పేజెస్’ ఒకటి, మరొకటి ‘కార్తికేయ’ సీక్వెల్ మూవీ. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ కు విరామం ఇచ్చాయి. అయితే ఈ లాక్ డౌన్ లాంగ్ గ్యాప్ ను నిఖిల్ సిద్ధార్ధ ఓ రేంజ్ లో సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఫిట్ నెస్ కు ప్రాధాన్యతనిస్తూ.. వివిధ రకాల కసరత్తుల్ని చేస్తున్నాడు. అందులో సైక్లింగ్ ఒకటి. అయితే నిఖిల్ సిద్ధార్ధ .. మామూలు సైకిల్ ను ఎంచుకోకుండా..  ఎలక్ట్రిక్ సైకిల్ పై రైడింగ్ షురూ చేయడం అందరినీ ఆకర్షిస్తోంది.

ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్స్ కంపెనీ అయిన ఈవీ కెనెక్ట్స్ వారి నుంచి  ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేసిన నిఖిల్ .. ఈ ప్రపంచాన్ని భయంకరమైన కాలుష్యాన్నుంచి కాపాడండి.. అంటూ..పిలుపునిచ్చాడు.   ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. 80 కిలో మీటర్స్ వరకూ నడిచే..  ఈ ఈ సైకిల్ ..  గంటకు 30కిమీ వేగంతో నడుస్తుంది.  త్వరలోనే దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాడు. ఎలక్ట్రిక్ సైకిల్ మీద కట్ బనీన్ తో కండలు తిరిగిన శరీరంతో రివీలైన నిఖిల్ సిద్ధార్ధ.. ఫ్యూచర్ లో  ఎలక్ట్రిక్ బైక్స్ కు బ్రాండ్  అంబాసిడర్ గా మారతాడేమో చూడాలి.  ప్రస్తుతం నిఖిల్ ఫోటోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

 

Leave a comment

error: Content is protected !!