Tollywood : టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ కు రంగం సిద్ధమైంది. బెల్లంకొండ శ్రీనివాస్, విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఇది మినీ మల్టీస్టారర్‌గా అభివర్ణించవచ్చు.

మంచు మనోజ్ ఈ మధ్య కాలంలో విలన్ పాత్రలపై మక్కువ చూపుతున్నాడు. ‘మిరాయ్’ సినిమాలో ఆయన విలన్‌గా నటిస్తున్నాడు. ఇంకా రెండు సినిమాల్లో విలన్‌గా నటించనున్నాడు. ఈ జాబితాలో ఇప్పుడు ఈ కొత్త సినిమా కూడా చేరింది. ‘నాంది’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విజయ్ కనకమేడల ఈ సినిమా కోసం మరో పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారు.

నిజానికి ఈ సినిమా ఈ ఏడాది ప్రారంభంలోనే పట్టాలెక్కాల్సి ఉంది. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది. వచ్చే కొద్ది రోజుల్లో ఈ కాంబినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి తెరపై ఏ రకమైన మాజిక్‌ను చేస్తారో చూడాలి.

Leave a comment

error: Content is protected !!