Nesha shetty : డీజే టిల్లు సినిమాతో నేహా శెట్టి చాలా మంది హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా నేహా కెరీర్‌లో ఊహించని రేంజ్ లో విజయం సాధించి, ఆమెను లైమ్‌లైట్‌లోకి తెచ్చింది. కానీ ఆ తర్వాత నేహాకు పెద్ద హిట్ పడలేదు. ఇప్పుడు ఆమె విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్‌లలో పాల్గొంటున్న నేహా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. తనకు ఇష్టమైన మీమ్ ఏంటి అని యాంకర్ అడిగితే, “సత్యమేమిటంటే, నాకు నా గురించి వచ్చే మీమ్స్ గాని, ఆర్టికల్స్ గాని కనిపించవు. ఎవరైనా పంపిస్తే తప్ప.. నేను నా గురించి మీడియాలో వచ్చే వార్తలు చదవడం మానేశాను. ఇది మంచి అలవాటో చెడ్డ అలవాటో నాకు తెలియదు” అని నేహా శెట్టి చెప్పింది.

“ఇంటర్నెట్‌లో మనం చూసే ప్రతిదీ మంచిది కాదు. అభిమానుల పోస్టులతో పాటు ట్రోలింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. నెగిటివ్ విషయాలు మానసికంగా నన్ను ప్రభావితం చేస్తాయి, కాబట్టి అలాంటివి చూడకుండా ఉంటాను” అని నేహా శెట్టి చెప్పుకొచ్చింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో అంజలి కూడా నటించగా, ఈ సినిమా మే 31న విడుదలకు సిద్ధంగా ఉంది.

 

 

Leave a comment

error: Content is protected !!