Nayanathara : సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ఏడాది దాదాపు పది చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఒక్కొక్క సినిమాతో తన అభిమానులను అలరిస్తూనే ఉంది. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. 2020లో విడుదలైన మూకుత్తి అమ్మన్ తమిళ చిత్రం  “అమ్మోరు తల్లి” గా తెలుగులోనూ రిలీజై మంచి సక్సెస్ సాధించింది.  నయనతార అమ్మవారి పాత్రలో నటించి మెప్పించింది.

ఆ సినిమాకు సీక్వెల్ రాబోతోందని, అందులో త్రిష నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలకు చెక్ పెడుతూ, “అమ్మోరు తల్లి 2” లోనూ నయనతారే అమ్మవారి పాత్రలో నటించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. “మంచి కోసం దైవం చేసే యుద్ధం” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేసిన ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ గ్లింప్స్‌లో నయనతార అమ్మవారి రూపంలో కనిపించి ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది.

 

Leave a comment

error: Content is protected !!