Nayanathara and Trisha : నయనతార, త్రిష – ఈ ఇద్దరు లేడీ సూపర్ స్టార్లు సీనియర్ హీరోలతో కలిసి నటించడం ద్వారా మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. మార్కెట్ లో వారి బలమైన బ్రాండ్ ఇమేజ్ సినిమాలకు పెద్ద బూస్ట్ ఇస్తుంది. పాన్ ఇండియా ఫాలోయింగ్ కలిగి ఉండటం వల్ల వీరికి ఈ అవకాశాలు వస్తున్నాయి. ఈ కారణంగానే చాలా మంది దర్శకులు ఈ స్ట్రాటజీని అనుసరిస్తున్నారు.

అందాల త్రిష కూడా ఈ కోణంలోనే మరింత హైలైట్ అవుతోంది. వయస్సుకు తగ్గ పాత్రలు, హీరోలు ఎంచుకోవడం వల్ల వీరిద్దరూ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటికే ఇద్దరూ మలయాళ సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం, నయనతార మరోసారి మలయాళ స్టార్ మమ్ముట్టితో కలిసి నటించడానికి సిద్ధంగా ఉంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి మలయాళంలో భాస్కర్ ది రాస్కెల్, ‘పుదియ నియమం’ అనే సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు ఈ జోడీ మూడోసారి కలిసి నటించడం ఆసక్తికరంగా మారింది.

త్రిష కూడా ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. ‘పొన్నియన్ సెల్వన్’ వంటి పాన్ ఇండియా చిత్రాలతో పాటు, మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా నయనతార చాలా మార్పు చెందింది. సినిమాల ఎంపిక, నటన, వ్యాపారాలు – అన్ని విషయాల్లోనూ ఆమె చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తోంది. సొంత నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలు నిర్మిస్తోంది, బ్యూటీ ప్రొడక్ట్స్ ను కూడా ప్రమోట్ చేస్తోంది. నయనతార, త్రిష – ఇద్దరికీ వయసు పెరుగుతున్నా.. వారి క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. సీనియర్ హీరోలతో కలిసి నటించడం ద్వారా వారు మరింత తమ కెరీర్ కు మైలేజ్ తెచ్చుకొకే ప్రయత్నం చేస్తున్నారు.

 

Leave a comment

error: Content is protected !!