Nayanathara : మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త అధ్యాయానికి తెరతీసేందుకు సిద్ధంగా ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో మెగాస్టార్ మమ్ముట్టి, లేడీ సూపర్ స్టార్ నయనతార జోడీగా నటించే కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సినిమాతో గౌతమ్ మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. మమ్ముట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఇది ఆయన నిర్మాతగా ఆరవ చిత్రం.

“భ్రమయుగం” తో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న మమ్ముట్టి, “టర్బో” చిత్రంతో యాక్షన్ హంగామా చేశారు. ఇప్పుడు ఈ కొత్త చిత్రంతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ‘భాస్కర్ ది రాస్కెల్, పుదియ నియమం’ లాంటి చిత్రాల్లో జంటగా నటించి మెప్పించిన మమ్ముట్టి, నయనతార ఈ సినిమాతో మూడోసారి కెమెరా ముందుకు రానున్నారు.

విభిన్నమైన కథనాలతో ప్రేక్షకులను అలరించే గౌతమ్ మేనన్ ఈ సినిమాలో ఎలాంటి కథను అందించబోతున్నారోనూ, ఈ జంట మళ్లీ ఎలాంటి మ్యాజిక్ చేయబోతోందోనూ తెలియాలంటే మరికొంత సమయం వేచి ఉండాల్సిందే.

 

Leave a comment

error: Content is protected !!