Srisrisri Rajavaru : నార్నే నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “శ్రీశ్రీశ్రీ రాజావారు”. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపద కథానాయికగా నటించింది. టోవినో థామస్ నటించిన మలయాళ సూపర్ హిట్ సినిమా ‘తీవండి’ కి ఇది అఫీషియల్ రీమేక్. నితిన్ ఇంతకు ముందు చేసిన చిత్రాలకు భిన్నంగా, “శ్రీశ్రీశ్రీ రాజావారు” చిత్రం వాణిజ్యపరంగా మరింత ఆకర్షణీయంగా ఉంటుందని నిర్మాత అన్నారు.

నితిన్‌ బావ అయిన ఎన్టీఆర్ ఈ కథను ఎంతగానో ఇష్టపడి దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని తన అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కించారని తెలిపారు. ఈ చిత్రం నితిన్ కెరీర్‌లో హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “మ్యాడ్‌”, “ఆయ్‌” వంటి చిత్రాలతో వరుస విజయాలు సాధించిన నితిన్, “శ్రీశ్రీశ్రీ రాజావారు”తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమ వుతున్నారు. రావు రమేశ్, నరేశ్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

 

Leave a comment

error: Content is protected !!