టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ కు ప్రియమైన హీరో నార్నె నితిన్. తన కెరీర్‌లో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తన తాజా చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’తో హ్యాట్రిక్ హిట్‌ను అందుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ‘ఆయ్’, ‘మ్యాడ్’ చిత్రాలతో విజయం సాధించిన నితిన్, ఈ చిత్రంతో తన విజయవంతమైన కెరీర్‌ను మరింతగా పటిష్టం చేయాలని భావిస్తున్నాడు.
ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. జాతీయ అవార్డు గ్రహీత సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, ఎన్టీఆర్ కూడా ఎంతగానో మెచ్చుకున్న కథ అని నిర్మాత చింతపల్లి రామారావు తెలిపారు. నితిన్ సరసన సంపద హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ, ఈ చిత్రం పూర్తి కమర్షియల్ ఫార్మాట్‌లో భారీ తారాగణంతో తెరకెక్కిందని, ఎన్టీఆర్ అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారని తెలిపారు. ఈ దసరాకి నితిన్ ఖాతాలో ‘ఆయ్’, ‘మ్యాడ్’ తరహాలో హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నట్లు తెలిపారు.

Leave a comment

error: Content is protected !!