Nani : లాస్ట్ ఇయర్ విజయవంతమైన సినిమాలతో అదరగొట్టాడు నేచురల్ స్టార్ నానీ. “దసరా” సినిమాలోని ఊర మాస్ పాత్రతో, ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలోని ఎమోషనల్ లవ్ జర్నీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం “సరిపోద శనివారం”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

గతంలో విడుదలైన ఈ సినిమా పోస్టర్ల కు, టీజర్ కు మంచి రెస్పాండ్ వచ్చింది. టీజర్ అయితే .. నాని పవర్‌ఫుల్ పాత్రను హైలైట్ చేసింది. షూటింగ్ ఎటువంటి అడ్డంకులు లేకుండా నాన్ స్టాప్ గా జరుగుతోంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ ప్రత్యేకమైన సినిమా నాని కెరీర్‌లో మరో ఘనవిజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

డీవీవీ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరిలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరిగింది. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం భారీ సెట్‌ వేశారు. నానితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు. క్లైమాక్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. నాని యాక్షన్‌తో పాటు సీరియస్ డ్రామా కూడా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సమాచారం. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, స్టార్ డైరెక్టర్ యస్. జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.

సినిమా విడుదల తేదీని ముందే నిర్ణయించి ప్రకటించారు. “సరిపోదా శనివారం” ఈ ఏడాది ఆగస్టు 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే, విడుదల తేదీ మార్పు అనే ఊహాగానాలు వచ్చాయి, కానీ నిర్మాతలు వాటిని స్పష్టం చేశారు. మరి ఈ సినిమా నానీకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!