Nandamuri Mokhajnya : నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంపై అభిమానులు భారీ ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ను పూర్తి చేశారు. మోక్షజ్ఞతో రెండు నెలల పాటు రిహార్సల్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్‌ను ప్రారంభించాలని నిర్మాతలు భావిస్తున్నారు.

ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఉండబోతుంది. ఇండియన్ మైథాలజీ ఆధారంగా రూపొందించబోయే ఈ సినిమాలో ఒక సూపర్ హీరో కథను చూపించనున్నారు. నందమూరి మోక్షజ్ఞ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వైరల్‌గా వ్యాపిస్తున్నాయి. నందమూరి అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారో తెలియాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.

Leave a comment

error: Content is protected !!