అక్కినేని నాగార్జున ఎర్లియర్ మూవీస్ ‘ఆఫీసర్, మన్మథుడు 2’ చిత్రాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. దాని ముందు ‘దేవదాస్’ చిత్రం కూడా అదే రిజల్ట్ తెచ్చిపెట్టింది. అందుకే ప్రస్తుతం నాగ్ కాస్తంత కేర్ఫుల్ గా కథలను ఎంచుకుంటున్నారు. లాక్ డౌన్ కు ముందు సల్మాన్ అనే కొత్త కుర్రోడి దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ అనే చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళిన నాగ్.. అదే చేత్తో ‘బంగార్రాజు’ చిత్రాన్ని కూడా ట్రాక్ ఎక్కించాలనుకున్నారు. అయితే లాక్ డౌన్ సమస్య రావడం వల్ల కుదరలేదు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించాలనుకుంటున్నారు. దాంతో పాటు నాగార్జున మరో ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

‘చందమామ కథలు, గుంటూరు టాకీస్, గరుడవేగ’ లాంటి చిత్రాలతో టాలీవుడ్ లో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు .. నాగార్జునను మంచి కథతో ఇంప్రెస్ చేశాడట. ప్రవీణ్ స్టోరీ లైన్ కు బాగా ఇంప్రెస్ అయిన నాగ్..  ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారట. సునీల్ నారంగ్ తో కలిసి శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.

Leave a comment

error: Content is protected !!