నావల్ కరోనా వైరస్ కోవిడ్ 19 ప్రస్తుతం ప్రపంచం అంతటికీ శత్రువు. ఇప్పటికే ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న ఈ మహమ్మారిని అడ్డుకోవాలంటే.. లాక్ డౌన్ ఒక్కటే పరిష్కార మార్గం.  బైటికి రాకుండా ఎవరింట్లో వారుండడమే అన్నటికన్నా ఉత్తమమైన మార్గం. అందులో భాగంగా  కరోనాపై  పోరాటానికి సూచకంగా కొవ్వొత్తులు, దీపాలతో సంఘీభావం ప్రకటించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా మంచి స్పందన కనిపించింది. మనమంతా ఒక్కటే అనే భావన కల్పించడానికి చేసిన ప్రయత్నానికి తెలుగు సినీ పరిశ్రమ అద్భుతంగా స్పందించింది.

ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత భారీ సంఖ్యలతో దీపాలు వెలిగించి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్స్ దీపాలు వెలిగించి మరో దీపావళిని తలపించారు. ఇక లైట్ ఫర్ ఇండియా కార్యక్రమంలో అక్కినేని నాగార్జున కుటుంబం చాలా యాక్టివ్‌గా కనిపించింది. మొదటి నుంచి అక్కినేని నాగార్జున ఫ్యామిలీ అన్ని రకాల చేయూతను ఇస్తున్నది. దీపాలు వెలిగించే కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ప్రజలను సోషల్ మీడియా ద్వారా కోరిన విషయం తెలిసిందే.  నాగార్జు, అమల, అఖిల్ దీపాలు వెలిగించి తమ మద్దతును తెలిపారు.

 

Leave a comment

error: Content is protected !!