టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవల తన అభిమానిని సెక్యూరిటీ సిబ్బంది లాగేసిన ఘటనపై క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వైరల్‌గా మారడంతో నాగార్జున స్పందించి.. తన అభిమానిని ముంబయి విమానాశ్రయంలో కలిసి ఆప్యాయంగా మాట్లాడారు.
అభిమానితో ఫోటోలు కూడా దిగిన నాగార్జున, సెక్యూరిటీ సిబ్బంది తనకు తెలియకుండానే అభిమానిని లాగేశారని వివరించారు. ఈ వీడియోను నాగార్జున అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఆయనను నిజమైన హీరో అని కొనియాడుతున్నారు.

ప్రస్తుతం నాగార్జున “కుబేర” అనే సినిమాలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. సున్నితమైన అంశాలతో, మనసుల్ని హత్తుకునే కథలకు పేరుగాంచిన శేఖర్ కమ్ముల, “కుబేర”లో తనదైన శైలిలో సందేశాన్ని చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

Leave a comment

error: Content is protected !!