టాలీవుడ్ లో ఆదర్శవంతమైన జంటల్లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. రీల్ లైఫ్ లో తొలి చిత్రంతోనే ప్రేమలో పడి.. రియల్ లైఫ్ లో దంపతులుగా మారిన ఈ జంట అంటే టాలీవుడ్ లో బాగానే క్రేజుంది. ఒక్క ‘ఆటోనగర్ సూర్య’ చిత్రాన్ని మినహాయిస్తే..  ‘ఏ మాయ చేశావె, మనం, మజలీ’ చిత్రాలతో సూపర్ జోడీగా ఫేమస్ అయ్యారు వీరిద్దరూ. చైతూ , సామ్ జంటగా నటించిన ఆఖరి చిత్రం ‘మజిలీ’. తాజా సమాచారం ప్రకారం ఈ జోడీ మరోసారి టాలీవుడ్ ప్రేక్షకుల్ని మాయ చేయనున్నారట.

తొలిసారిగా చైతన్య, సమంతా జంటగా నటించిన ఈ సినిమా ఏ మాయ చేశావె. ఈ సినిమా సూపర్ హిట్టవ్వడంతో దీనికి సీక్వెల్ తీయాలని దర్శకుడు గౌతమ్ మీనన్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. సీక్వెల్ లో కూడా అదే జోడీతో మ్యాజిక్ రిపీట్ చేస్తాడట. అలాగే తమిళ వెర్షన్  ‘విన్నైత్తాండి వరువాయి’ లో నటించిన శింబు, త్రిషలతో సీక్వెల్ తెరకెక్కిస్తాడని వినికిడి. ఒరిజినల్ సినిమాల తరహాలోనే ఈ సినిమాలో వీరే కామియోలు చేస్తారట. చైతు-సమంతా కలిసి నటిస్తే ఆ సినిమా అటోమేటిక్ గా క్రేజీ ప్రాజెక్టుగా మారిపోతుంది. మరి చైతు, సామ్ ఈ సారి ఏ రేంజ్ లో మాయచేస్తారో చూడాలి.

 

 

Leave a comment

error: Content is protected !!