Naga Chaitanya : గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నాగ చైతన్య-చందు మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం “తండేల్”. శ్రీకాకుళం జిల్లా లోని ఒక మత్స్యకారుడి కథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. “కార్తికేయ 2” తర్వాత చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, “100% లవ్” తర్వాత నాగ చైతన్య-గీతా ఆర్ట్స్ కాంబినేషన్‌లో వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇటీవల విశాఖపట్నంలో జరిగిన షెడ్యూల్‌తో చిత్రం షూటింగ్ చాలా వరకూ పూర్తయింది. చైతన్య చెన్నయ్‌కు తిరిగి వెళ్లగా, మిగిలిన రెండు షెడ్యూల్‌లు హైదరాబాద్, ఢిల్లీలో జరపాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ షెడ్యూల్‌ల్లో ఒకటి రెండు పాటలు, ఒక ఫైట్ సన్నివేశం చిత్రీకరిస్తారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రెండు బిట్ సాంగ్స్, నాలుగు మెయిన్ సాంగ్స్ ఉండనున్నాయి. అయితే, “పుష్ప 2”, “గేమ్ ఛేంజర్” వంటి పెద్ద చిత్రాలు డిసెంబర్‌లో విడుదల కానున్న నేపథ్యంలో “తండేల్” విడుదల డేట్ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం.

Leave a comment

error: Content is protected !!