Mrunal Thakur : 2012లో విడుదలైన ‘సన్ ఆఫ్ సర్దార్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన అజయ్ దేవగణ్, సంజయ్ దత్‌లు దాని సీక్వెల్ ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలోనూ వీరిద్దరూ జస్సీ సింగ్, బిల్లు సింగ్ పాత్రల్లో నటించనున్నారు. అయితే, ఈ చిత్రం మొదటి భాగంతో ఎలాంటి సంబంధం లేకుండా స్వతంత్ర కథతో రూపొందుతుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో కథానాయికగా అందాల తార మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తాజా సమాచారం. ఇటీవల ‘కల్కి’ సినిమాలో నటించి ప్రశంసలు అందుకున్న మృణాల్, ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటించడానికి చాలా ఉత్సాహంగా ఉంది.  ఈ చిత్రీకరణ ఈ నెల చివరిలో ప్రారంభం కానుంది. అజయ్ దేవగణ్, మృణాల్‌ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను, పాటల్ని స్కాట్లాండ్‌లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘దే దే ప్యార్‌ దే 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్న అజయ్ దేవగణ్, త్వరలోనే ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే విడుదల కానున్నాయి.

Leave a comment

error: Content is protected !!