Mohanlal : ఇటీవలే ‘మలైకోటై వాలిబన్’‌తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యారు. ప్రయోగాత్మక కథలు, సవాలుతో కూడిన పాత్రలకు పేరుగాంచిన మోహన్‌లాల్, ‘రామ్’ చిత్రంలో తనలోని మరో కోణాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ‘నెరు’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రెండో చిత్రం. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రకటించి నాలుగేళ్లు అయినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమైంది.

అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర షూటింగ్‌ను ఆగస్టులో మళ్లీ ప్రారంభించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ టైటిల్ పాత్రలో రా ఏజెంట్‌గా నటించనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రమేశ్, సుధన్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్ ‘కన్నప్ప’, ‘బరోజ్’ తదితర చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Leave a comment

error: Content is protected !!