సునీల్ , క్రాంతిమాధవ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కామెడీ చిత్రం ‘ఉంగరాల రాంబాబు’ . ఈ సినిమా అంతగా ఆడకపోయినా.. ఇందులో హీరోయిన్ గా నటించిన మల్లూ కుట్టి మియా జార్జ్ కి మంచి పేరొచ్చింది. ఆకర్షించే అందంతో పాటు.. ఆకట్టుకొనే అభినయం అమ్మడి ప్రత్యేకత. 2010 లో మాలీవుడ్ లో కథానాయికగా రంగ ప్రవేశం చేసిన అమ్మడు..  ఆమె అందానికి తగ్గట్టుగా గ్లామర్ పాత్రల్ని పోషించకుండా.. అభినయానికే పెద్ద పీట వేయడం విశేషం. రీసెంట్ గా ‘డ్రైవింగ్ లైసెన్స్’ చిత్రంలో వెహికల్ ఇన్స్ పెక్టర్ భార్యగా నటించి మెప్పించింది మియా జార్జ్.

మలయాళ చిత్రాలతో పాటు పలు తమిళ చిత్రాల్లోనూ కథానాయికగా నటించిన అమ్మడు ఇప్పటివరకూ  ఒకే ఒక్క తెలుగు చిత్రం ‘ఉంగరాల రాంబాబు’ లోనే నటించింది. అసలు విషయానికొస్తే .. గ‌త కొంత కాలంగా ఫ్యామిలీ ఫ్రెండ్‌, బిజినెస్‌మెన్ అశ్విన్ ఫిలిప్‌తో ప్రేమ‌లో వున్న మియా జార్జ్ రీసెంట్‌గా  సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్ చేసుకుందని వినికిడి. కేర‌ళ‌లో ఇరు కుటుంబాల‌కు చెందిన అత్యంత స‌న్ని‌హితులు మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నార‌ట‌. పెళ్లికి మూహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. సెప్టెంబ‌ర్‌లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్టు సమాచారం.

 

 

Leave a comment

error: Content is protected !!