మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అన్నట్టుగానే ఉగాది కానుక ఇచ్చారు.  ఈ రోజు నుంచీ సోసల్ మీడియాలో చిరంజీవి తన అభిమానులకు టచ్ లో ఉంటారు. ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసి.. ఉగాది సందర్భంగా తన మొదటి ట్వీట్ ను పోస్ట్ చేశారు. చిరు ఇలా ట్వీట్ పెట్టారో లేదో.. అప్పుడే 14వేల లైక్స్, 6వేల రీట్వీట్స్ వచ్చిపడ్డాయి.

ఇక చిరంజీవి తన అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ .. అందరికీ ఈ ఏడాది మంచి జరగాలని ఆకాంక్షిస్తూ.. కరోనా వైరస్ బారిన పడకుండా ఇంటి పట్టునే క్షేమంగా ఉండడని ట్వీట్ చేశారు. చిరు మొదటి ట్వీట్ ను చూస్తోన్న అభిమానులకు భలే ఎక్పైట్ మెంట్ గా ఉంది.  

 

Leave a comment

error: Content is protected !!