Committee Kurrollu : నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఆగస్ట్ 9న విడుదలైన ఈ చిత్రం, డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది.

సీనియర్ నటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విమర్శకుల ప్రశంసలతో పాటు సెలబ్రిటీల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే సూపర్‌స్టార్ మహేష్‌, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌, క్రిష్‌, దేవిశ్రీప్రసాద్ ఇలా చాలా మంది ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్‌ను అభినందించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి ఎంటైర్ టీమ్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. నిర్మాత నిహారిక కొణిదెల‌, దర్శకుడు య‌దువంశీతో పాటు చిత్రంలోని న‌టీన‌టులంద‌రూ చిరంజీవిని క‌లుసుకున్నారు. వారంద‌రితో చిరంజీవి ప్ర‌త్యేకంగా ముచ్చ‌టిస్తూ స‌క్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తీ ఒక్క‌రిని ఆయ‌న అభినందించారు.

Leave a comment

error: Content is protected !!