Mattuvadalara 2 : టాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘మత్తు వదలరా’ సినిమా సీక్వెల్‌తో ప్రేక్షకులను మరోసారి అలరించడానికి సిద్ధమవుతోంది. అదే క్రియేటివ్ టీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ సింహ కోడూరి హీరోగా నటిస్తుండగా, సత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.

పార్ట్ 1లో డెలివరీ ఏజెంట్లుగా కనిపించిన బాబు, యేసు ఈసారి స్పెషల్ ఏజెంట్లుగా మారి, స్పెషల్ టాస్క్‌లు, ట్విస్ట్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సీక్వెల్‌లో క్రైమ్ ఎలిమెంట్‌లు ఎక్కువగా ఉంటాయని పోస్టర్లు సూచిస్తున్నాయి. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో శ్రీ సింహ, సత్య డైనమిక్ పోజులలో, వారి ప్రత్యర్థులపై గన్స్‌ని ఫైర్ చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక బిల్డింగ్ పై  హై ఎమర్జెన్సీ టీమ్ అని రాసుంది. ఈ సీక్వెల్ మొదటి భాగం కంటే మరింత ఎక్సయిటింగ్ గా ఉంటుందని పోస్టర్ సూచిస్తుంది.

ఈ చిత్రంలో శ్రీ సింహ, సత్యతో పాటు ఫారియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతి పాత్ర కీలకంగా ఉండబోతోంది. ప్రముఖ నటులు చేరడంతో ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోంది. కాల భైరవ సంగీతం అందిస్తుండగా, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. మత్తు వదలరా 2 చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Leave a comment

error: Content is protected !!