Matka : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి నటించిన పాన్-ఇండియా చిత్రం ‘మట్కా’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత, చిత్ర బృందం ఇప్పుడు వైజాగ్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్‌లో, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

1958-1982 మధ్య జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. నాలుగు భిన్నమైన గెటప్పుల్లో వరుణ్‌ నటన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.  జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం, ఎ.కిశోర్‌ కుమార్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నోరా ఫతేహిపై చిత్రీకరించిన పబ్ గీతం ఈ చిత్రంలో హైలైట్‌గా నిలిచే అవకాశం ఉంది. నవీన్‌ చంద్ర, అజయ్‌ ఘోష్, కన్నడ కిశోర్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!