మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మక నిర్మితమవుతున్న మలయాళ చిత్రం ‘భ్రమయుగం’ ఫిబ్రవరి 15, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలకు సిద్దమైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.చిత్ర మలయాళ వెర్షన్ ఓవర్సీస్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ “ట్రూత్ గ్లోబల్ ఫిల్మ్స్” కాగా, చిత్ర కేరళ థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ ఆంటో జోసెఫ్ యొక్క “AAN మెగా మీడియా”. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ జనవరి 26, 2024న అన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేసిన సౌండ్‌ట్రాక్‌తో చలనచిత్ర మార్కెటింగ్ ప్రచారాన్ని చురుకుగా ప్రారంభించింది.

Leave a comment

error: Content is protected !!