Joju George : ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ తన డెబ్యూ డైరెక్టోరియల్ చిత్రం ‘పణి’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలై మంచి స్పందనను పొందింది. మాస్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన రివేంజ్ డ్రామాగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. జోజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, కథానాయకుడిగా కూడా నటిస్తున్నారు.

అభినయ అతనికి జోడిగా నటిస్తోంది. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ సాగర్, జునైస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 28 సంవత్సరాల సినీ కెరీర్ లో జోజు మొదటిసారిగా దర్శకుడి బాధ్యతలు చేపట్టారు. జూనియర్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా తన నటనా ప్రతిభను చాటుకున్న జోజు ఇప్పుడు డైరెక్టర్ గా కూడా రాణించాలని ఆశిస్తున్నారు.

నటుడిగా జోజు ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్, సూర్యలతో కలిసి ఒక పాన్ ఇండియా చిత్రం లో నటిస్తున్నారు. అలాగే, బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో మరొక చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని జోజు స్వయంగా నిర్మిస్తున్నారు. ‘పణి’ చిత్రం 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకొని, థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం జోజు కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!