ఎర్లియర్ గా తానాజీ చిత్రంతో భారీ హిట్టు అందుకున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్ గణ్. కేవలం హిందీ చిత్రాల్లోనే కాకుండా.. తన పాత్ర బాగుంటే.. ఏ ప్రాంతీయ భాషా  చిత్రంలోనైనా వెనుకాడని ఆ హీరో .. రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రంలో యన్టీఆర్, తారక్ లకు గురువులాంటి పాత్రను పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే. ఈ హీరో నటిస్తోన్న తాజా చిత్రం ‘మైదాన్’. లాక్ డౌన్ లేకపోతే.. ఈ డిసెంబర్ లోనే విడుదల కావాల్సింది ఈ సినిమా.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేకర్స్ దీని విడుదలను వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేశారు. ఆగష్ట్ 13, 2021 న ఈ సినిమా విడుదలకు ముహూర్తం నిర్ణయించారు. హైదరాబాద్‌కి చెందిన ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియో, బోనీకపూర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. ఆ మధ్య విడుదల చేసిన ‘మైదాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీతో మరో పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.

 

 

 

 

Leave a comment

error: Content is protected !!