ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అత్యవసర సేవలు చేసేవాళ్లు తప్పించి అందరూ ఇంట్లోనే ఉన్నారు. అందులో సినిమా నటీనటులు ఉన్నారు. ఎపుడు షూటింగ్స్‌తో క్షణం తీరిక లేకుండా గడిపే హీరోలకు లాక్‌డౌన్ కారణంగా కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఐతే.. క్వారంటైన్ పీరియడ్‌ను మహేష్ బాబు వాడుకుంటున్నట్లు మరే హీరో వాడుకోవడం లేదేమో..? ఎప్పుడూ బిజీగా ఉండే ఈయన.. ఇప్పుడు అనుకోకుండా దొరికిన టైమ్‌ను హాయిగా పిల్లలతో గడిపేస్తున్నాడు.

అంతేకాదు కొడుకు గౌతమ్ కృష్ణతో పాటు కూతురు సితారతో సరదాగా గడిపేస్తున్నాడు. ఇటీవల  కొడుకు గౌతమ్ కృష్ణతో తన ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో  కొడుతోన్న ఫోటోను ట్విట్టర్‌లో నూ, ఇన్ స్టాలోనూ పోస్ట్ చేసింది నమ్రతా శిరోద్కర్ . అంతేకాదు ఇప్పటి వరకు మిస్ అయిన టైమ్ అంతా ఇప్పుడు కవర్ చేస్తూ పండగ చేసుకుంటున్నాడు. కాలు కూడా బయటికి పెట్టకుండా సెలబ్రిటీస్ అంతా ఆదర్శంగా నిలుస్తున్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!