కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది.  పలు దేశాల ప్రజలు దాని బారిన పడ్డారు. ఆ పెను భూతం భారత్ కూ వ్యాపించి .. ఇక్కడ ప్రజల్నీ భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో పలు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొందరు మృత్యువాత కూడా పడ్డారు. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీని కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు.

ప్రత్యేకించి .. క్వారంటైన్ పీరియడ్‌ను మహేష్ బాబు వాడుకుంటున్నట్లు మరే హీరో వాడుకోవడం లేదేమో..? ఎప్పుడూ బిజీగా ఉండే ఈయన.. ఇప్పుడు అనుకోకుండా దొరికిన టైమ్‌ను హాయిగా పిల్లలతో గడిపేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు సూపర్ స్టార్. ఇప్పటి వరకు మిస్ అయిన టైమ్ అంతా ఇప్పుడు కవర్ చేస్తూ పండగ చేసుకుంటున్నాడు. కాలు కూడా బయటికి పెట్టకుండా సెలబ్రిటీస్ అంతా ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో ముఖ్యంగా మహేష్ బాబు అయితే రోజూ తన టైమ్ టేబుల్ కూడా సెట్ చేసుకున్నాడు. తాజాగా గౌతమ్‌తో ఆన్‌లైన్ టెన్నిస్ గేమ్ ఆడుతున్నాడు మహేష్ బాబు.

Leave a comment

error: Content is protected !!