Mahesh Babu : తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన అకాల వరదల నేపథ్యంలో సినీ ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, మహేష్ బాబు తన కుటుంబం తరపున 50 లక్షలు, ఏఎంబీ తరపున 10 లక్షలు అందించారు. ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్‌తో కలిసి హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి చెక్‌ను అందించారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు కొత్త లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన తదుపరి చిత్రం కోసం లాంగ్ హెయిర్, గడ్డం, మీసాలతో కొత్త లుక్‌ను అవలంబించారు. ఈ లుక్‌తో ఆయన హాలీవుడ్ స్టార్‌ను తలపిస్తున్నారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.  ప్రస్తుతం రాజమౌళి ఈ చిత్రం కోసం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. వర్క్‌షాపులు నిర్వహిస్తూ సినిమా కోసం పూర్తిస్థాయి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు కూడా వీటిలో పాల్గొంటూ సినిమా కోసం కృషి చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!