‘ఆర్ఆర్ఆర్’ తో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రాజమౌళి.. తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న ఉన్న ఈ చిత్రం ఆగస్టు లేదా సెప్టెంబర్ లో చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

చిత్ర నిర్మాత కె.ఎల్.నారాయణ మాట్లాడుతూ..”మహేశ్ – రాజమౌళి కాంబినేషన్ ను 15 ఏళ్ల క్రితమే సెట్ చేశాము. ఇప్పుడు వాళ్లిద్దరి క్రేజ్ మరో స్థాయిలో ఉంది. అయినా సరే వాళ్లు ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు సినిమా చేస్తున్నారు. నిజానికి రాజమౌళికి హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ, వాటిని కాదనుకుని నా కోసం సినిమా చేస్తున్నారు.

గత కొన్ని నెలలుగా పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తన పాత్రకు తగ్గట్లుగా మహేశ్ తనని తాను మలుచుకుంటున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో చిత్రీకరణ మొదలు కావొచ్చు. కథ చాలా బాగుంది. దీంట్లో ఆఫ్రికన్ నేపథ్యముంది. బడ్జెట్ ఎంత అన్నది ఇంకా నిర్ణయించలేదు. ఈ ప్రాజెక్ట్ కు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టేందుకు సిద్ధం.” అని నిర్మాత తెలిపారు.

Leave a comment

error: Content is protected !!