ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా ఖుషీ పాటలే మార్మోగుతున్నాయి. విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా, శివ నిర్వాణ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఖుషీ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌ హేషమ్‌ అబ్ధుల్‌వాహబ్‌. ఈ చిత్రంతో సెప్టెంబర్‌ 1 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది. ఈ చిత్ర విశేషాలను మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషమ్‌ అబ్ధుల్‌ వాహబ్‌ పాత్రికేయులతో ముచ్చటించారు.
ఈ చిత్రంలో నా రోజా నువ్వే, ఖుషీ టైటిల్ సాంగ్ రీసెంట్ గా రిలీజైన ఓసి పెళ్లామా సాంగ్‌ ఇలా అన్ని పాటలు అన్ని వర్గాల వారికి నచ్చేలా మ్యూజిక్‌ చేయగలిగామన్నారు. ఈ సినిమాలో కష్టపడి కంపోజ్ చేసిన పాట టైటిల్ సాంగ్. ఖుషి టైటిల్ సాంగ్ మొదట సినిమాలో లేదు. టీజర్ కోసం ట్యూన్ చేశాను. అయితే ఆ ట్యూన్ అందరికీ నచ్చింది. దీంతో కంప్లీట్ సాంగ్ చేయమన్నారు. అలా ఖుషీ టైటిల్ సాంగ్ కంప్లీట్ అయ్యింది. ఈ పాట కోసం 20 నుంచి 25 డెమోస్‌ చేసానన్నారు హేషమ్‌ అబ్ధుల్‌. దేశ విదేశాల్లో ఖుషీ సాంగ్స్‌ గురించి మాట్లాడుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు.. ‘ఖుషి’ సినిమా కోసం వీణ, సితార్ వంటి ఇస్ట్రుమెంట్స్ వాడినట్టుగా చెప్పారు. “నేను ఎక్కువ రోజులు ఒక సినిమాకు పనిచేసింది కూడా ‘ఖుషి’కే. ఒక హోటల్ లో నెల రోజుల పాటు మ్యూజిక్ సిట్టింగ్స్ చేశాం. విజయ్‌ దేవరకొండకు మ్యూజిక్‌ పట్ల మంచి అభిరుచి ఉంది. మ్యూజిక్‌ విషయంలో విజయ్‌ సజెషన్స్‌ చాలా హెల్ప్ అయ్యాయి. విజయ్‌ దేవరకొండ సమంతల కెమిస్ట్రీ అద్భుతం.. ఒకరికి ఒకరు ధీటుగా యాక్ట్ చేసారు. డైరెక్టర్‌ శివకు సినిమా పట్ల అపారమైన ప్యాషన్‌ ఉంది. ఏం కావాలో ఏది ఎంత కావాలో పర్‌ఫెక్ట్ గా తెలిసిన డైరెక్టర్. అందుకే ఈసినిమా మ్యూజిక్‌ తో పాటు అన్ని విభాగాలతో అద్భుతంగా పని రాబట్టారు ” అన్నారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషమ్‌ అబ్ధుల్‌ వాహబ్‌.
‘ఖుషి’ మ్యూజిక్ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఓ నాలుగు రోజులు విరామం తీసుకుంటాను. ఆ తర్వాత నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేస్తా. ప్రస్తుతం ఈ సినిమా పాటల పనులు జరుగుతున్నాయి. అలాగే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తెలుగులో కీరవాణి, మిక్కీ జే మేయర్, భీమ్స్ మ్యూజిక్ ఇష్టమన్నారు హేషమ్‌ అబ్ధుల్ వాహబ్‌.

Leave a comment

error: Content is protected !!