Krithishetty : మొదటి సినిమా నుంచే దూసుకొచ్చిన కృతి శెట్టి, “ఉప్పెన” తర్వాత స్టార్ హీరోయిన్ గా స్థిరపడ్డారు. తమిళ, మలయాళ భాషల్లోనూ అవకాశాలు దక్కించుకున్న ఈమె, తాజాగా “మనమే” చిత్రంలో శర్వానంద్ తో జంటగా నటించారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.

ఈ చిత్రం ఒక రొమాంటిక్ కామెడీ కథ అయినప్పటికీ, బలమైన భావోద్వేగాలతో కూడుకుని ఉంది. చిన్నారి, ఒక జంట నేపథ్యంలో సాగే ఈ కథ మనసుల్ని హత్తుకుంటుంది. ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. “మనమే” అనే టైటిల్ కి కూడా ఈ కథే కారణం.

నేను ఈ చిత్రంలో సుభద్ర అనే యువతి పాత్రలో కనిపిస్తాను. గతంలో నేను చేసిన పాత్రలకు భిన్నంగా, ఈ పాత్ర చాలా నిక్కచ్చిగా, స్వతంత్రంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు భార్యలు ఎలా ఉంటారో నా పాత్రలో చూపించాను. ఈ పాత్ర నాకు చాలా తృప్తినిచ్చింది.

ఇది గ్యాప్ కాదు, ఒక కొత్త ప్రయాణం. తమిళంలో మూడు సినిమాలు, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను. అన్ని భాషల్లో ఒకే వేగంతో సినిమాలు చేయడం కష్టం. తెలుగు నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. నాకు ఇంత పేరు, ప్రేమ తెచ్చిపెట్టింది తెలుగు ప్రేక్షకులే. తెలుగులో జాగ్రత్తగా కథలను ఎంచుకుంటూ నటిస్తున్నాను.

నాణేనికి రెండు వైపులా ఉంటాయి అని నేను నమ్ముతాను. మంచి కథలను ఎంపిక చేసుకోవడం తప్ప నా చేతుల్లో ఏమీ లేదు. సినిమా విజయానికి నేను మాత్రమే కారణం కాదని నాకు తెలుసు. అందుకే పరాజయాలు నాపై పెద్దగా ప్రభావం చూపలేదు. నేను నేర్చుకున్నాను, కష్టపడ్డాను అని చెప్పాలి.

Leave a comment

error: Content is protected !!