Krithisanon : బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ తొలిసారిగా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె నటించి, నిర్మించిన చిత్రం ‘దో పత్తి’. ఈ మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రానికి శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. కవలలైన అక్కాచెల్లెళ్ల రహస్యాలను వెలికితీసే పోలీసు అధికారి పాత్రలో బాలీవుడ్‌ సీనియర్ నటి కాజోల్‌ కనిపించనున్నారు.

ఈ రహస్యాలు ఏమిటి? ఈ కవలల జీవితంలో ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అనేది చిత్రం చూస్తేనే తెలుస్తుంది. కృతి సనన్‌ స్వంత బ్యానర్‌ ‘బ్లూ బటర్‌ ఫ్లై ఫిల్మ్స్‌’ పై నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 25న ఓటీటీ వేదికపై విడుదల కానుంది. ‘కథ ప్రారంభంతో.. ఆట ఇప్పుడే మొదలైంది..’ అంటూ చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపైంది. షహీర్‌ షేక్, తన్వీ అజ్మీ, బ్రిజేంద్ర కాలా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

 

Leave a comment

error: Content is protected !!