మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనేనేను చిత్రాలతో టాలీవుడ్ లో అజేయ దర్శకుడిగా  దూసుకుపోతున్న కొరటాల శివ.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో  ఆచార్య చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడ్డ ఈ సినిమా ..ఆగస్ట్ లో తిరిగి చిత్రీకరణ కు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. కొరటాల శివ తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన నెక్స్ట్ మూవీ బన్నీతో ఉంటుందని ఒక ప్రత్యేక పోస్టర్ తో కొరటాల అనౌన్స్ చేశాడు.

అల్లు అర్జున్ కెరీర్లో 21వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తో కలిసి కొరటాల శివ ఫ్రెండ్ మిక్కిలినేని సుధాకర్ యువసుధ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దీనికి అల్లు అర్జున్ స్నేహితులు శాండీ – స్వాతి – నట్టి లు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా సామాజిక అంశాలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం రూపొందనుందని మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆఫీసియల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ 2022న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టర్ లో ఇద్దరు వ్యక్తులు నది ఒడ్డున నిలబడి అవతల ఒడ్డున ఉన్న ఊరిని చూస్తున్నట్లుగా డిజైన్ చేయబడింది. మొత్తం మీద ఈ సినిమా బన్నీ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కొరటాల శివ మార్క్ మేసేజ్ కూడా ఉంటుందని అర్థం అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Leave a comment

error: Content is protected !!