కోలీవుడ్ క్రేజీ బ్రదర్స్  సూర్య, కార్తీలు.. టాలీవుడ్ లో కూడా తమ సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. మంచి మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరూ ఇంతవరకూ ఒకే స్ర్కీన్ షేర్ చేసుకోలేదు. అలాంటి రేర్ కాంబో గురించి సౌత్ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దానికి టైమ్ వచ్చినట్టే అనిపిస్తోంది.  త్వరలోనే  సూర్య, కార్తీ ఓ అదిరిపోయే మల్టీస్టారర్ చేయబోతున్నారని టాక్.

తమిళ చిత్ర వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. మలయాళ హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ కోసం ఈ ఇద్దరూ రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద  భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్ర రీమేక్‌ హక్కుల కోసం అన్ని భాషల నుంచి పోటీ నెలకొని ఉంది. ఇప్పటికే ఈ చిత్ర హిందీ రీమేక్‌ హక్కులను జాన్‌ అబ్రహాం సొంతం చేసుకోగా.. తాజాగా తమిళ హక్కులను సూర్య, కార్తి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ రీమేక్‌ను తమ సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోనే రూపొందించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర దర్శకుడు, ఇతర చిత్ర బృందంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

 

Leave a comment

error: Content is protected !!