ప్రస్తుతం మన దేశం కరోనా వైరస్ ను లాక్ డౌన్ తో సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది. ఈ సందర్భంగా.. సామాన్య ప్రజలనుంచి కోట్లకు పడగలెత్తిన సెలెబ్రిటీస్ వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే ఈ లాక్ డౌన్ టైమ్ ను  సినీ సెలబ్రిటీస్ మాత్రం డిఫరెంట్ గా స్పెండ్ చేస్తున్నారు. కొందరు ఇంటిపనులు చేస్తున్నారు, కొందరు కొత్త రకం వంటలు చేస్తున్నారు, మరికొందరు బొమ్మలు గీసుకుంటున్నారు, ఇంకొందరు తమికిష్టమైన సినిమాలు చూస్తూ.. తమ కిష్టమైన ఆటపాటల్లో తలమునకలైపోతున్నారు. ఆ లిస్ట్ లో అందాల కియారా అద్వానీ కూడా ఉంది.

కియారా అద్వానీ  ఈ లాక్ డౌన్ టైమ్ ను మూడు రకాలుగా స్పెండ్ చేస్తోందట. తనకిష్టమైన లూడో ఆడుతూ.. కిచిడీ వండుకుంటూ..  ఒక స్ట్రేంజర్ కు తన ప్రేమను అందిస్తోందట. తనకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక స్ట్రేంజర్ బాగోగులు చూసుకుంటుందట. ఆ స్ట్రేంజర్ కరోనా బారిన పడటంతో ఆమె హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులు క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉండేదట. అయితే ప్రస్తుతం ఆమె బాగానే ఉందని కియారా చెప్పుకొచ్చిందట. ఏదేమైనా ఒక సెలబ్రిటీ అపరిచితురాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని డైలీ ఆమె క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడం గొప్ప విషయమే కదా. అందుకే ఆమె అభిమానులు కియారా హ్యుమానిటీని  కొనియాడుతున్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!