Keerthisuresh : టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల తార కీర్తి సురేశ్ తన తాజా చిత్రం ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తి ఈ చిత్రంలో కయల్విజి పాత్రలో నటిస్తోంది. సుమన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఓ అప్డేట్ ఇచ్చింది కీర్తి. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించింది.

“సాహసోపేతమైన కథతో, హృదయాన్ని కదిలించే కయల్విజి పాత్ర ద్వారా, వినోదాత్మకమైన భావోద్వేగ ప్రయాణాన్ని అందించడానికి ‘రఘుతాత’ మీ ముందుకు వస్తున్నాడు. నవ్విస్తూనే, కదిలించేలా చేసే ఈ కథను ఖచ్చితంగా చూడండి” అని కీర్తి పోస్ట్‌లో రాసుకొచ్చింది. ‘బేబీ జాన్‌’ చిత్రంతో హిందీలోనూ అలరించడానికి సిద్ధంగా ఉన్న కీర్తి ‘రఘుతాత’తో మరోసారి తన నటనా ప్రతిభను ప్రదర్శించబోతోంది. ఈ చిత్రం ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవడానికి అవకాశం ఉంది.

Leave a comment

error: Content is protected !!