కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు ఇంట్లో తమ భార్యలకు పనుల్లో సహాయపడుతున్నారు. ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇంటి ప‌నులు చేయించ‌కండి అంటూ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్ట‌ర్ సందీప్ వంగా మ‌గ‌వారికి ‘బీ ద రియ‌ల్ మేన్‌’ అనే ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్‌ను సందీప్ వంగా నుంచి స్వీకరించిన ఎస్ఎస్ రాజమౌళి.. తన టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. తారక్, రామ్ చరణ్‌, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు సుకుమార్, అలాగే తన పెద్దన్న ఎమ్.ఎమ్. కీరవాణిలను నామినేట్ చేశారు.

రాజమౌళి ఇచ్చిన టాస్క్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ పూర్తి చేసి మరికొందరిని ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి నామినేట్ చేసిన ఆయన పెద్దన్న కీరవాణి కూడా తన టాస్క్‌ను పూర్తి చేశారు. ఈ సవాలు కరోనా వలే అంటుకునేటట్లు కనిపిస్తోంది. సందీప్ వంగా నుంచి రాజమౌళికి. అతని నుంచి నాకు. నా నుంచి మరికొందరికి. నా వంతు పూర్తయింది.. దీనిని ఇప్పుడు డైరెక్టర్ క్రిష్, ఎస్. ఎస్. థమన్‌లకు అంటిస్తున్నాను..’’ అని ట్వీట్ చేసిన కీరవాణి.. తను ఇంటి పనులు చేస్తున్న వీడియోని ఈ ట్వీట్‌కు జత చేశారు.

Leave a comment

error: Content is protected !!