Karthi : కార్తి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సత్యం సుందరం’. ఈ సినిమా ఈ నెల 28న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా ఇంటరాక్షన్ లో కార్తీ పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాల్ని పంచుకున్నారు. ’96’ ఫేమ్‌ దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. కార్తి ఈ చిత్ర కథను ఒక అద్భుతమైన నవలలా అభివర్ణించారు. కథ చదువుతున్నప్పుడు ఆనందంతో కన్నీళ్లు కూడా వచ్చాయని పేర్కొన్నారు.

కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథ ఇది. ‘సాగర సంగమం’ చిత్రం వల్ల కలిగే అనుభూతిని ఈ చిత్రం కూడా అందిస్తుందని అన్నారు. ఈ కథ అరవింద్‌ స్వామి నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. కార్తి ఈ చిత్రంలో ఒక చిన్న పల్లెటూరిలో చీరల షాప్‌ నడిపే అమాయకమైన యువకుడి పాత్రను పోషించారు. తన పాత్ర చాలా చలాకీగా మాట్లాడుతుందని, సంభాషణలు సహజంగా ఉంటాయని చెప్పారు.

సూర్య ఈ చిత్రం చూసి కార్తిని గట్టిగా హత్తుకున్నారని, ఈ కథలు కార్తికి ఎలా వస్తున్నాయో అని ఆశ్చర్యపోయారని కార్తి తెలిపారు. జ్యోతిక కూడా కార్తి తొలి చిత్రం చూసినప్పుడు కౌగిలించుకున్నారని, ఇప్పుడు మళ్లీ ఈ సినిమా చూసి గర్వంగా హత్తుకున్నారని చెప్పారు. ‘ఊపిరి’ తర్వాత తెలుగులో మళ్లీ చేయలేదని, ప్రస్తుతం కథలు వింటున్నానని కార్తి తెలిపారు. ప్రస్తుతం ‘సర్దార్‌ 2’ చిత్రీకరణ దశలో ఉందని, ‘వా వాతియారే’ కూడా రానుందని, ‘ఖైదీ 2’ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లొచ్చని తెలిపారు.

Leave a comment

error: Content is protected !!