Kareena Kapoor : క్రూ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన కరీనా కపూర్‌, తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతోంది. ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనుండగా, మహిళా ప్రాధాన్యత కలిగిన కథాచిత్రాలకు పేరుగాంచిన మేఘన గుల్జర్‌ దర్శకత్వం వహించనున్నారు. ఛపాక్‌, రాజీ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మేఘన గుల్జర్‌, ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభను చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ఓ దారుణ హత్యాచార సంఘటన నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ కేసులో బాధితురాలి పాత్రలో కరీనా కపూర్‌ నటించనున్నట్లు సమాచారం. హీరోగా ఆయుష్మాన్ ఖురానా నటించనుండగా, ఇప్పటివరకు సినిమాకు పేరు ఖరారు కాలేదు. ఈ ఏడాది చివరినాటికి చిత్రీకరణ ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. 25 ఏళ్లుగా సినీ రంగంలో రాణిస్తున్న కరీనా కపూర్‌, తన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!